VijayaKumar

Apr 03 2024, 17:50

భువనగిరిలో బిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యక్రమం బుధవారం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు, గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ అభ్యర్థి క్యమా మల్లేష్ గారు ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు  

 ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులు మాట్లాడుతూ...

కాంగ్రెస్ అంటేనే లీక్ లు ,ఫెక్ న్యూస్ లు...పాలన గాలికొదిలేశారు కాంగ్రెస్ వాళ్లు......అక్రమ కేస్ లతో కాలయాపన చేస్తుంది... 

ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్నాడు రేవంత్ రెడ్డి మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బొంద పెట్టాలి.

పార్టీలో చేరికలతో కాంగ్రెస్ బిజీ అయ్యంది.. కేసీఆర్  బయటికి రాగానే రాష్ట్రంలో కాల్వల్లో నీళ్లు పారుతున్నాయ్....ఎనటికైన కేసీఆర్ గారే తెలంగాణ కు శ్రీరామరక్ష...

ఎన్నికల కోడ్ సాకుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది.

ధాన్యం కి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు...ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాం అని మోసం చేశారు..కార్యకర్తలు కాంగ్రెస్ మోసాలను గ్రామాల్లో విడమర్చి చెప్పాలి.

కార్యకర్తలు అంతా ఉద్యమ స్పూర్తితో పోరాటం చేయాలి..

అలివి గాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది..

ఇవ్వాళ కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది..

కొంత మంది స్వార్ధపరులు పార్టీని వీడి పోతున్నారు.. వాళ్ళను ప్రజలు నమ్మడం లేదు.. భువనగిరి లో గెలుస్తాం...క్యామ మల్లేష్ మాస్ లీడర్...తప్పకుండా గెలుస్తారు...

స్వయానా రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుండి సస్పెండ్ అయిన వ్యక్తి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్ధి చమల కిరణ్ కుమార్ రెడ్డి...ప్రశ్నించే గొంతును గెలిలించండి.....అసెంబ్లీ లో కోట్లాడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో BRS గెలవాలి.....

సబ్బండ వర్గాలను నిలువునా మోసం చేసింది కాంగ్రెస్....

నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారు....నల్ల చట్టాలు తెచ్చి రైతులను చంపిన పార్టీ బీజేపీ....మళ్ళీ అధికారంలో కి వచ్చేది BRS పార్టీనే..

కొంత మంది పార్టీ విడి పోతే ఎం నష్టం లేదు.. పార్టీ వదిలి పోయిన వారు  కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడైనా మళ్ళీ వారిని పార్టీలో చేర్చుకోమ్...ఈ భూమి ఉన్నంత కాలం BRS ఉంటుంది.

VijayaKumar

Apr 03 2024, 17:37

దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం.... కొడారి వెంకటేష్ సామాజిక కార్యకర్త


 భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య స్పూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైందని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. బుధవారం భువనగిరి అమరవీరుల సంస్మరణ స్థూపం వద్ద నిర్వహించిన దొడ్డి కొమురయ్య 97 వ జయంతి సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి నిజాం నవాబు ఏర్పాటు చేసుకున్న రాజాకార్ ప్రైవేటు సైన్యం, దొరలు, జామీందారుల ఆగడాలకు వ్యతిరేకంగా చేపట్టిన శాంతియుత రైతాంగ పోరాట ఉద్యమంలో దొడ్డి కొమురయ్య పై రజాకార్లు కాల్పులు జరిపి ఆయన ప్రాణాలు బలిగొన్నారని ఆయన తెలిపారు.ఆ తరువాత తెలంగాణలో గుప్తల సంఘం, సాయుధ పోరాట సంఘాలు ఏర్పడి తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసి రజాకార్ల నుండి విముక్తి కల్గించారని ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా శాంతియుతంగా జరుగుతున్న సమయంలో కాసోజు శ్రీకాంత్ చారి మరణంతో తీవ్ర రూపం దాల్చిందని ఆయన అన్నారు. తొలి అమరుల స్పూర్తితో ప్రజలు పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని ఆయన అన్నారు.

నేటి యువత తొలి అమరులైన దొడ్డి కొమురయ్య, కాసోజు శ్రీకాంత్ చారిల జీవిత చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేసి, భవిష్యత్తు తరాలకు అందించటానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్, యాదవ సంఘం జిల్లా నాయకులు వేల్పుల యాద మల్లయ్య యాదవ్, గుండె బోయిన వీరేష్ యాదవ్, పర్వతం కృష్ణ యాదవ్, నక్కల చిరంజీవి యాదవ్, బద్దుల అశోక్ యాదవ్, శ్రీ రాం శరత్ యాదవ్ ,రాసాల రణధీర్ యాదవ్, మాదరబోయిన నరేష్ యాదవ్, శ్రీధర్ యాదవ్ కందుల విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 03 2024, 17:26

ఈనెల 5న భువనగిరిలో జరుగు సిపిఎం నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశమును జయప్రదం చేయండి; మాటూరి బాలరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు


 ఈనెల 5వ తేదీన భువనగిరి పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ లో జరుగు సిపిఎం నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు కోరారు

  ఈరోజు వలిగొండ మండల కేంద్రంలో జరిగిన సిపిఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు దీనిలో భాగంగా భువనగిరి నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

 ఈ సమావేశానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు బి. వెంకట్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు ఈ సమావేశంలో ఎన్నికల కోసం గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు పనిచేసే ప్రణాళిక రూపొందించడం చర్చించడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశానికి సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ హాజరుకావాలన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి 500 రూపాయల బోనస్ సౌకర్యాన్ని కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పంట ఎండిపోయిన రైతులను ఆదుకోవాలని ఎకరానికి 20వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు 

   ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కల్కూరి రామచందర్,కూర శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Apr 03 2024, 17:16

వలిగొండ మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 97వ జయంతి వేడుకలు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 97 వ జయంతి వేడుకలు కురుమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు కంకాల కిష్టయ్య మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన పోరాట యోధుడిని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లింగస్వామి, చిర్ర చందు, బత్తిని సహదేవ్, కాసుల వెంకన్న , జూకంటి నరసింహ, బుగ్గ బీరప్ప, ఎమ్మే మల్లేశం, వెలిజాల రమేష్, సాయి యాదగిరి, రేగు సాయిలు, దయ్యాల వెంకటేష్ ,దయ్యాల వీరస్వామి ,కంకల శ్రీనివాస్, మల్గ వెంకటేశం, బుగ్గ ఉదయ్, వేగు మల్లికార్జున్, కౌడే వెంకటేశం, కౌడ కృష్ణ, ఎమ్మే చిన్న లింగస్వామి, ఎమ్మే నవీన్, కౌడే శివ ,దయ్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 02 2024, 21:45

ఈనెల 12, 13న యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ఎఫ్ఐ నాల్గవ మహాసభ జయప్రదం చేయండి: ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు


భువనగిరిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో SFI భువనగిరి మండల మహాసభ కుక్కుట్ల శివాని అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది, ఈ మహాసభకు ముఖ్య అతిథిగా SFI జిల్లా కార్యదర్శి వనం రాజు హాజరై మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి పోసిన ఆంధ్ర మహాసభకు కేంద్రమైన భువనగిరి పట్టణంలో ఈనెల 12 13 తేదీల్లో SFI యాదాద్రి భువనగిరి జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించుకుంటున్నాం,* కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లను, ఫెలోషిప్ వెంటనే విడుదల చేయాలి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అవకాశవాద రాజకీయాలను ఓడించాలి,

అదేవిధంగా మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బిజెపిని ఓడగొట్టే విధంగా విద్యార్థులందరూ ఏకం కావలసిన పరిస్థితి ఉందని , బిజెపి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత విద్యను పూర్తిగా కాషాయకరణ, విద్యను ధ్వంసం చేయడం జరిగింది. విద్య అనేది అంగట్లో సరుకుగా మారింది అదేవిధంగా గత టిఆర్ఎస్ పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించింది,అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది విద్యారంగం అభివృద్ధి చెందే వారి పాలన విధానం కనబడుటలేదు, పెండింగ్లో ఉన్న 7200 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, పెంచిన మెస్ కాస్మోటీ ఛార్జ్ లను వెంటనే అమలు చేయాలని, అద్దె భవనంలో ఉన్న హాస్టల్ లను సొంత బిల్డింగ్ను ఏర్పాటు చేసి నూతన గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని , విద్యారంగ సమస్యలను పరిష్కరించేలా విద్యార్థులకు సన్నగా చేయడం కోసం ఈ మహాసభలు ఎంతో తోడ్పడతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో GMPS జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ SFI జిల్లా ఉపాధ్యక్షులు లావుడియా రాజు SFI మండల నాయకులు అన్నంపట్ల రమణ, కుకుట్ల శివాని, మోటే శంకర్, సల్మాన్ ముద్దంనాగరాజు,ముద్ధంమహేష్, జన నితిన్, హరిగే మని,వంశీ, తదితరులు పాల్గొన్నారు.

               

VijayaKumar

Apr 02 2024, 21:02

మాదిగలకు ఎంపీ టికెట్లు కేటాయించని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్తాం : ఎంఆర్పిఎస్


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద MRPS ఆధ్వర్యంలో ధర్నా రాస్తరోకో నిర్వహించడం జరిగింది 

ముఖ్య అతిథులు

MSP ఉమ్మడి నల్గొండ జిల్లా కో ఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

 తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే

అందులో ఒక్క సీటు కూడ మాదిగలకు కేటాయించక పోవడం బాధాకరం

కాంగ్రెస్ పార్టీ పూర్తిగ మాలల పార్టీ గ మారింది

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కర్కే తన మాల కులస్తులకే ఎంపీ సీట్లు కేటాయిస్తున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా మాలల చేతుల్లో బంది అయ్యాడు...

మాదిగల జనాభా 75% ఉన్న ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా మాదిగలను అణిచివేతకు గురి చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క మాదిగ బిడ్డను కూడా ఎదగనీయకుండా నేను మాదిగనని చెప్పుకుంటూ కడియం శ్రీహరి తన రాజకీయ జీవితము అంచలంచలుగా ఎదుగుకుంటూ ఇపుడు వరంగల్ పార్లమెంట్ ఎంపీ సీటు తన కూతురికి కావ్యకు ఇప్పించడం మాదిగలకు బాధాకరం.

మాదిగ కులస్తులు 100% కడియం కావ్యను మాదిగ పల్లెలలో మాదిగ గ్రామాలలో మండల కేంద్రంలో నియోజకవర్గం లో జిల్లా కేంద్రంలో రానీయమని ఓడిస్తామని మాట్లాడడం జరిగింది

ఈ కార్యక్రమంలో.... దుబ్బ రామకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ మంద శంకర్ మాదిగ ఇటుకల దేవేందర్ మాదిగ బూడిద జాన్ కుసంగల కుమార్ బోడ సునీల్ బొజ్జ సైదులు కొమర స్వామి ఇరుగు శ్రీశైలం కిషోర్ రాజశేఖర్ రమేష్ రాజు ప్రసాద్ ప్రశాంత్ శ్రీకాంత్ శీను బాలయ్య తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Apr 02 2024, 20:58

ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: ఏఐటియూసి రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్


 భువనగిరిలో స్వర్ణగిరి మానేపల్లి హిల్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నూతనంగా ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు.

     మంగళవారం రోజున స్వర్ణగిరి ఆటో డ్రైవర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నూతనంగా ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా 100 మంది ఆటో డ్రైవర్లు ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ వారిని సాధారణంగా యూనియన్ లోకి ఆహ్వాణించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం లో ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని, భువనగిరి కొత్త బస్టాండ్ లో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగం లో సుమారుగా 15 లక్షల మంది ఆటో మీద ఆధారపడి జీవిస్తున్నారని, గత ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో, చాలా మంది డిగ్రీలు, ఉన్నత చదువులు చదివి ఉపాధి దొరకకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కోసం అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించడంతో ప్రయాణికులు ఆటోలు ఎక్కకపోవడంతో ప్రస్తుతం రోజుకు 200 నుండి 300 మాత్రమే సంపాదించడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దీనివలన ప్రతినెలా ఫైనాన్స్ కట్టలేక మానసికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఫైనాన్స్ కట్టలేక ఆటోలను కోల్పోయే ప్రమాదం ఉన్నదని అన్నారు. ఆటో డ్రైవర్లకు జీవనభృతి కింద నెలకు రూ.10,000/- ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విదంగా ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలని,  డిమాండ్ చేశారు.

 అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది 

అధ్యక్షులు:- తారాల ఉపేందర్ 

 ఉపాధ్యక్షులు:- గోపరాజు గణేష్ , బింగి సురేష్ 

 ప్రధాన కార్యదర్శి:- మర్రి శివ 

 సహాయ కార్యదర్శులు:- మాటూరి దుర్గ, బోడ స్వామి 

కోశాధికారి :- ఎడ్ల నరేందర్

వర్కింగ్ ప్రెసిడెంట్ :- ఎండీ ఇమ్రాన్ 

 గౌరవ సలహా దారులు:- సామల శోభన్ బాబు,

గనబోయిన వెంకటేష్,

సామల భాస్కర్ 

గౌరవ అధ్యక్షులు :- గొర్ల లక్ష్మణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

VijayaKumar

Apr 02 2024, 20:13

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు యువత పునరంకితం కావాలి : పంజాల జైహింద్ గౌడ్ నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు


 నిజమైన స్నేహానికి ప్రతిరూపం , యువతకు ఆదర్శం, మతసామరస్యానికి ప్రతీకైన సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ను నేటి యువత ఆదర్శంగా తీసుకుని బహుజన రాజ్యాన్ని స్థాపించాలని నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు పంజాల జైహింద్ గౌడ్, పాపన్న యువసేన జాతీయ కన్వీనర్ పరిటాల రవి గౌడ్ లు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక భువనగిరి కోట వద్ద జరిగిన సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్థంతి సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపన్న గౌడ్ స్నేహితున్ని అప్పటి ఔరంగజేబు సైన్యం తీవ్రంగా కొడుతుంటే తాను వీరసైనికునిగా మారి నలుగురు ఔరంగజేబు సైనికులను హతమార్చాడని వారన్నారు.ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి నాలుగువేల మంది యువకులను సమీకరించి పాపన్న గౌడ్ ప్రైవేటు సైన్యాన్ని తయారుచేసుకొని ఆనాటి అన్యాయాలను, అక్రమాలను ఎదిరించాడని వారన్నారు.

ఒక ముస్లిం అమ్మాయి తనని ఇష్టపడుతుందని తెలుసుకొని,ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని మతసామరస్యానికి ప్రతీకైనాడని, ఆమె సోదరుని సాయంతో భువనగిరి కోటను స్వాధీనం చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించి చరిత్ర సృష్టించిచాడని, ఆతర్వాత గోల్కొండ కోట పై దండయాత్ర చేసి విజయం సాధించిన పాపన్న గౌడ్ బహుజన రాజ్యం జెండాను గోల్కొండ కోట పై ఎగురవేసాడని వారు తెలిపారు. గత పాలకులు సర్థార్ సర్వాయి పాపన్న చరిత్రను కనుమరుగు చేసారని,ఆ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించటానికి నేటి యువత కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ వర్థంతి కార్యక్రమంలో భువనగిరి మాజీ కౌన్సిలర్ దేవరకొండ సత్యనారాయణ, సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బత్తుల గణేష్ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు ఎర్ర శివరాజ్, గోపరాజు వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Apr 02 2024, 20:05

కమ్మ గూడెం సమీపంలోని ఆర్బిఆర్ ఫంక్షన్ హాల్ వద్ద, నగదు పట్టుకున్న వలిగొండ పోలీసులు


పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీల్లో భాగంగా వలిగొండ మండలం కమ్మ గూడెం సమీపంలోని ఆర్బిఆర్ ఫంక్షన్ హాల్ వద్ద వలిగొండ ఎస్సై డి మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎన్నికల నిబంధనల మించి నగదు తీసుకువెళ్తున్న గర్దాసు శివకుమార్ నుండి 5,04,569 డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఎన్నికల నిబంధనలో భాగంగా ఒక వ్యక్తి 50 వేలకు మించి తీసుకువెళ్లకూడదని ఒకవేళ నిబంధనల గురించి తీసుకువెళ్తున్నట్లయితే సరైన ధ్రువపత్రాలను సమర్పించాలని తెలిపారు.

VijayaKumar

Apr 01 2024, 22:37

చౌటుప్పల్ ప్రీమియర్ లీగ్ విజేతలకి బహుమతులు అందజేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


చౌటుప్పల్ ప్రీమియర్ లీగ్ లో విజేత నిలిచిన వారికి మొదటి బహుమతి రూ 1,00,000 రెండవ బహుమతి 50,000రూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరియు ప్రజల మనిషి రాజన్న అందజేయడం జరిగింది.

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని తంగడపల్లిలో 

ముస్కు మధుసూదన్ రెడ్డి స్టేడియంలో జరిగినటువంటి

చౌటుప్పల్ ప్రీమియర్ లీగ్ లో విజేత నిలిచిన వారికి మొదటి బహుమతి రూ 1,00,000/- రెండవ బహుమతి 50,000/-రూ

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అందజేయడం జరిగింది.

ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ స్పాన్సర్స్ మున్సిపల్ చైర్మన్ గౌరవ శ్రీ వెన్ రెడ్డి రాజు గారు,ZPTC చిలుకూరి ప్రభాకర్ రెడ్డి,Mpp తాడూరి వెంకట్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు పబ్బు రాజు గౌడ్ .

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి,మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, సింగల్ విండో చైర్మన్ చెన్నగొని అంజయ్య, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, అంతటి బాలరాజు, సందగళ్ళ సతీష్, మోగదాల రమేష్, బాలు మహేంద్ర, రావుల స్వామి, కొండూరు వెంకన్న తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు